ఫ్రెండ్స్ మాత్రం ప్రవల్లిక అసలు కాలేజీ కె రాలేదు అని చెపుతారు, దీంతో కంగారు పద సుభ్రమణ్యం ప్రవల్లిక వెతకడానికి కాలేజీ కి వెళ్తాడు ప్రవల్లిక రోజు వెళ్లే దారి లో నే వెళ్తాడు కానీ ఆచూకీ తెలియదు ....
ప్రవల్లిక బెస్ట్ ఫ్రెండ్ పూజిత ఇంటికి వెళ్తాడు సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం : "అమ్మ పూజిత ప్రవల్లిక ఇంకా ఇంటికి రాలేదు నిను ఏమైనా కలిసింది" కంగారుగా అడుగుతాడు సుబ్రహ్మణ్యం
పూజిత : "ఆదేంటి అంకుల్ తన్ను కాలేజీ కి వెళ్లలేదా"
సుబ్రహ్మణ్యం : "అదిఎంటి అమ్మ నువ్వు తాను కలిసే కదా వెళ్లారు"
పూజిత : "ఈ రోజు నేను కాలేజీ కి వెళ్ళలేదు అంకుల్, నాకు కొంచం తల నొప్పిగా ఉంటేను కాలేజీ కి వెళ్ళలేదు, అయినా మీరు ఒక సరి కాలేజీ లో కనుకున్నారా"
సుబ్రహ్మణ్యం : "ప్రవల్లిక
కాలేజీ కి రాలేదు అని చెప్పారు అమ్మ"
పూజిత : "బహుశా తన ఎక్కడికైనా వెళ్ళింది ఏమో అంకుల్, చాల మంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి వాళ్ళని ఒక సరి కనుకుంటాను"
సుబ్రహ్మణ్యం : "అలాగే నేను కూడా ఒక సరి నా బంధువులని అడుగుతాను బహుశా అక్కడికి కానీ వెళ్ళింది ఏమో"
పూజిత : "అలాగే అంకుల్, కంగారు పడకండి అంకుల్ ఎక్కడికి వెలిఉండదు, తనకి ఏమి కాదు"
పూజిత ఇంటినుండి బయలుదేరిన సుబ్రహ్మణ్యం తన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి కనుకుంటాడు, అందరూ తెలియదు ఇక్కడికి రాలేదు అని చెపుతారు. అప్పటికి రాత్రి 10 అవుతుంది వెంటనే దగరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు కంప్లైన్ చేయడానికి.
సుబ్రహ్మణ్యం : "సార్ సార్ ! నా కూతురు కనపదం లేదు సార్" కంగారుపడుతూ ఎస్.ఐ దగరకు వెళ్తాడు
ఎస్ ఐ : "ఏంటి అయ్యా ఆలా అరుస్తావ్ విషయం సరిగా చూపు"
సుబ్రహ్మణ్యం : "సార్ నా కూతురు కనపట్లేదు సార్ ఉదయం కాలేజీ కి వెళ్ళింది తిరిగి ఇంటికి రాలేదు సార్"
ఎస్ ఐ : "ఫ్రెండ్స్
ఇంటికి కాల్ చేసి కనుకున్నారా, కాలేజీ లో అడిగారా తాను ఎపుడు కాలేజీ నుండి బయలుదేరిందో"
సుబ్రహ్మణ్యం : "సార్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు, అసలు కాలేజీ కె వెళ్ళలేదు సార్, కాలేజీ వాళ్ళు తన ని అసలు ఈ రోజు క్లాస్ చూడలేదు అని చెప్పారు"
ఎస్ ఐ : "సరే తన పేరు మిగతా డీటెయిల్స్ ఇవండీ"
సుబ్రహ్మణ్యం తన కూతురు పూర్తీ డీటెయిల్స్ ఇస్తాడు, దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తారు ..
తర్వాతి రోజు సుబ్రహ్మణ్యం ఇంటికి పోలీసులు వస్తారు, అప్పటికే చుటుపకాల వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరు అక్కడే ఉంటారు
పోలీసులు ఈ కేసు ని కూడా ఒక సాదా సిద కేసు లనే తీసుకుంటారు తమ ఫార్మాలిటీస్ పూర్తీ చేసి వెళ్తారు ...
సుబ్రహ్మణ్యం మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు కానీ ప్రవల్లిక ఆచూకీ తెలియదు ..
సుబ్రహ్మణ్యం స్నేహితుడు ఒకడు ప్రవల్లిక ని వెతకడానికి మీడియా హెల్ప్ తీసుకోమంటాడు, మీడియా ద్వారా వెళ్తే కేసు మీద పోలీసులు సీరియస్ గ తీసుకుంటారు గవర్నమెంట్ కి కూడా ఈ విషయం అర్థం అవుతుంది..
దింతో వెంటనే ఈ విషయాన్ని మీడియా చెపుతాడు సుబ్రహ్మణ్యం.. మీడియా తమ ఛానల్స్ లో ప్రవల్లిక గురించి న్యూస్ వేస్తారు .. దింతో కేసు మీద అందరికి ఇంటరెస్టింగ్ వస్తుంది, ప్రవల్లిక కనపడకుండా పోయిన రెండు రోజులు తర్వాత ఈ కేసు గురించి రాష్ట్రమంతా చేర్చ జరుగుతుంది, ప్రతి న్యూస్ ఛానల్ ప్రవల్లిక గురించి చూపిస్తారు .. దింతో పోలీసులు మీద వత్తిడి వస్తుంది .. కమిషనేర్ కి ఈ కేసు అప్పచెపుతుంది గవర్నమెంట్ .....
తరవాత ఏమైంది ....